పౌనూర్ గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో పౌనూరు గ్రామంలో ఎండా కాలంలో పొలాలకు వెళ్లే రైతులు, మహిళలకు, విద్యార్థులకు పక్క ఊళ్లకు వెళ్లి వస్తున్న వారికి దాహం తీర్చేందుకు ఊరి దగ్గర్లో చలి వేంద్రం ఏర్పాటుచేయాలని పౌనూరు గ్రామం జనసేన నాయకులకు చింటు, రాకేష్, శివ, వినయ్, ప్రణయ్ తదితరులు కలిసి చలి వేంద్రం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఊరిలోనికి వస్తున్న ప్రతి ఒక్కరికి చల్లటి మినరల్ వాటర్ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి సేవా బాటలో నడుస్తున్నందుకు ఆనందంగా ఉందని, తమ స్థాయికి తగ్గట్టు చిన్న చిన్న సేవా కార్యక్రమాలు ఇలానే భవిష్యత్తు లో చేస్తూనే ఉంటాం అన్నారు.