పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అధికారం దిశగా ప్రతి జనసైనికుడు కృషి చేయాలి: ఆకుల ఉమేష్

హిందూపురం కొల్లకుంటలో ఇంచార్జ్ ఆకుల ఉమేష్ అధ్యక్షతన శుక్రవారం మండల కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ హిందూపురం మండల అధ్యక్షుడుగా ఎంపికైన చక్రవర్తిని ఘనంగా సన్మానించడం జరిగింది. ప్రతి జనసైనికుడు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వారు అవలంభిస్తున్న విధానాలను ఎండగట్టాలని, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అధికారం దిశగా ప్రతి జనసైనికుడు కృషి చేయాలని, త్వరలోనే మిగతా కమిటీలు వేసి జనసైనికులందరికి పార్టీ సుమిచిత స్తానం కల్పిస్తుందని, బడుగు బలహీన వర్గాలకు పార్టీ అండగా ఉంటుందని ఇంచార్జ్ శ్రీ ఆకుల ఉమేష్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శులు లిచ్ రమణ, సురేష్, సహాయ కార్యదర్శులు శేఖర్, శివ, నాయకులు మంజు, లోకేష్, బాలాజీ, భాస్కర్, నాగభూషణ్, సురేష్, శివ, కిషోర్, నవీన్ ప్రభు, మనోహర్, మునీర్, నరేష్ మరియు పెద్ద సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.