జగన్ రెడ్డిని గద్దె దింపేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి

ఇచ్ఛాపురం నియోజకవర్గం: ఇచ్ఛాపురం “శంఖారావం” బహిరంగసభలో ఇచ్చాపురం జనసేన ఇన్ ఛార్జి దాసరి రాజు మాట్లాడుతూ.. పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప… జగన్ రెడ్డిని గద్దె దింపేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. విజన్-2020 చంద్రబాబుది అయితే జగన్ రెడ్డిది విధ్వంసక విధానం. చంద్రబాబు ముందుచూపుతో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. అన్ని ప్రాంతాలకు స్వాతంత్ర్యం వచ్చినా ఇచ్ఛాపురానికి స్వాతంత్ర్యం రాలేదు. వంశధార ప్రాజెక్టును పూర్తిచేసేందుకు చంద్రబాబు కృషిచేస్తే.. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత నీరుగార్చారు. కొందరికి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో ఎంతో మంది పేద విద్యార్థులు నష్టపోతున్నారు. ఇచ్ఛాపురంలో 30వేల మందికిపైగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత కిడ్నీ వ్యాధిగ్రస్తులను పట్టించుకోవడం లేదు. 200 పడకల ఆసుపత్రిలో కనీసం నెఫ్రాలజస్ట్ లేరు. ఇచ్చాపురం మినీ స్టేడియం ఏర్పాటు సమస్య సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంది. జనసేన-టీడీపీ ప్రభుత్వంతో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. మనమే అధికారపక్షం, మనమే ప్రతిపక్షం.. ఇగోలు వీడి జనసేన-టీడీపీ కలిసి చేయాలని దాసరి రాజు పేర్కొన్నారు.