జనసైనికులే పార్టీకి కొండంత బలం

*జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.

జనసేన పార్టీ సిద్దాంతాలనూ, పవన్ కళ్యాణ్ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయటంలో జనసైనికుల కృషి వెలకట్టలేనిదని, జనసేన పార్టీకి జనసైనికులే కొండంత బలం అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ ని చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామినాయుడుతో కలిసి జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళహరి మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఏ పార్టీకి కూడా లేని నిబద్ధత, నిజాయితీ కలిగి ఉండి కష్టపడి పనిచేసే కార్యకర్తలు జనసేన పార్టీలో ఉన్నారన్నారు. సుమారు మూడు లక్షల యాభై వేలమంది క్రియాశీలక సభ్యులతో పార్టీ క్షేత్రస్థాయిలో ఎంతో పటిష్టంగా ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై బలంగా పోరాడుతూనే , పార్టీని ప్రజలకి మరింత చేరువ చేసేలా ప్రతీ జనసైనికుడు కృషి చేయాలన్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వటమే కాకుండా స్థానిక ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకం అవుతూ స్థానిక సమస్యలను పరిష్కరించడంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళహరి చేస్తున్న కృషిని నాదెండ్ల మనోహర్ కొనియాడారు. పార్టీలో బాగా కష్టపడుతున్నావు, ఇదే విధంగా ముందుకు వెళ్ళు అంటూ ఆళ్ళ హరిని మనోహర్ అభినందించారు. అనంతరం నాదెండ్ల మనోహర్ కి స్వామి వివేకానంద జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆళ్ళహరి బహుమతిగా అందచేశారు.