అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: తాటికొండ ప్రవీణ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండల వ్యాప్తంగా అకాల వర్షాల కారణంగా కల్లాలలో మరియు మార్కెట్ యార్డులలో రైతులు ఆరబోసిన ఒడ్లు అకాల వర్షానికి తడిసి ముద్దాయి కొట్టుకుపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు ఆ తడిసిన ధాన్యాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ములకలపల్లి మండల అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్ మాట్లాడుతూ అకాల వర్షం వల్ల ధాన్యం తడవటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ తడిసిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనాలని మరియు వరదకు ధాన్యం కొట్టుకుపోయిన రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగ సెక్రటరీ గరికే రాంబాబు, మండల సహాయ కార్యదర్శి బొక్క వెంకటేశ్వర్లు, ములకలపల్లి గ్రామ కమిటీ నాయకులు నకిరకంటి రాము, సుద్దాల రమేష్, గోపగాని సాయి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.