నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎంతో మేలు: విద్యాసాగర్‌రావు

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని,  ఈ చట్టాలను రాజకీయ కోణంలో చూడొద్దని మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్‌రావు వ్యాఖ్యానించారు. రాజకీయ పబ్బం గడుపుకోవాలని రైతులను తప్పుదారి పట్టించొద్దని హితువు పలికారు. నూతన వ్యవసాయ చట్టాలను కొందరు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ రైతుల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడానికి మోదీ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కొత్త చట్టాలపై గ్రామస్థాయి రైతుల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని సూచించారు.