పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పీఏసీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆదివారం ముమ్మిడివరంలో శ్రీదేవి థియేటర్ వారి శ్రీదేవి ట్రేడర్స్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు, అదేవిదంగా ముమ్మిడివరం బైపాస్ రోడ్డు కాశి వారి తూము సెంటర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ధాబా నూతనంగా ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. క్రాప చింతలపూడి గ్రామానికి చెందిన గుర్రాల వారి వివాహ వేడుకల్లో పాల్గొని అనంతరం అమలాపురంనకు చెందిన మెట్ల రమణ బాబు గృహప్రవేశంలో పాల్గొన్నారు. వీరి వెంట జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జున రావు, రాష్ట్ర కార్యదర్శి జక్కంశెట్టి బాలకృష్ణ, గుద్దట జమ్మి, గోదాశి పుండరీష్, దూడల స్వామి, శీలం ప్రసాద్, నాతి నాగేశ్వరరావు, కన్నీడి నాని, రాయుడు, గోవిందు, గెద్దాడు పండు, రవి, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.