మణినాగేశ్వరపురం గ్రామములో జనంతో జనసేన 2వ రోజు

టెక్కలి నియోజకవర్గం, జనసేన పార్టీ నాయకుల అధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్తూ జనసేన పార్టీ బలోపేతానికి జనంతో జనసేన అనే కార్యక్రమాన్ని రెండవ రోజు చేపట్టడం జరిగింది.. ఈ కార్యక్రమం టెక్కలి నియోజకవర్గం, కోటబొమ్మాళి మండలంలో మణినాగేశ్వరపురం గ్రామంలో ప్రతి గడపకి వెళ్తు, పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో వివరిస్తూ… ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ పై ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. జనంతో జనసేన కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ నాయకులు షణ్ముఖ, వినోద్, చందు, ఉదయ్, శ్రీను పట్నాయక్, జనార్థన్, ప్రసాద్, పవన్, గంగయ్య, తేజ తదితరులు పాల్గొన్నారు.