క్రీస్తు రాజ్య సువార్త మహాసభలకు ముఖ్య అతిథిగా పితాని

ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం, కందికుప్ప గ్రామములో ట్రూ గాడ్స్ లవ్ మినిస్ట్రీస్ నిర్వహించు సిల్వర్ జూబ్లీ మహోత్సవ క్రీస్తు రాజ్య సువార్త మహాసభలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ పాల్గొని బాలకృష్ణ చేతుల మీదుగా 20 మందికి వస్త్రదానం చేయడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరైన పితాని బాలకృష్ణని ట్రూ గాడ్స్ లవ్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్ అధ్యక్షులు నేదునూరి ఎలీషా మరియు సంఘ సభ్యులు ఈ సందర్భంగా బాలకృష్ణని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంసాని పాండురంగారావు, భీమాల సూరి నాయుడు, విళ్ళ శివ, దూడల స్వామి, పితాని రాజు, కడలి కొండ, గుత్తుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.