జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

ఉమ్మడి నల్గొండ జిల్లా: నరేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన జనసేన ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సరికొప్పుల నాగేశ్వరరావు. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని శివాజీ నగర్ కు చెందిన పోతుగంటి నరేష్ ఇటీవల ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తో మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యుల్ని జనసేన పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సరికొప్పుల నాగేశ్వరరావు పమర్శించారు. అనంతరం జనసేన పార్టీ తరఫున 5000 రూపాయల ఆర్థిక సాయం మరియు 25 కేజీల బియ్యాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దాసరి వాసు, మారుపాక నాగరాజు, సాయి చరణ్, కోమర్రాజు, శ్రీను, మోత్కూరి ఆనంద్, ధారా వెంకట్, మచ్చ పవన్ కళ్యాణ్, బెజ్జం కిరణ్, సట్టు చందు మరియు నేరేడుచర్ల జనసైనికులు పాల్గొన్నారు.