చిలకలూరిపేటలో “నా సేన కోసం… నా వంతు”

చిలకలూరిపేట నియోజకవర్గం జిల్లా కమిటీ సభ్యులు తోట రాజా రమేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తలపెట్టిన “నా సేన కోసం… నా వంతు” కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, మరియు ఎస్.కె.జిలాని పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ… ఈరోజు జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం జరగటం చాలా సంతోషకరమని తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. మన పార్టీ తలపెట్టిన “నా సేన కోసం..నా వంతు” కార్యక్రమం ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని మండల, గ్రామ అధ్యక్షులదే ముఖ్యపాత్ర అని తెలిపారు. మన పార్టీ అధ్యక్షుల వారు ఏ కార్యక్రమం తలపెట్టినా మనమందరం కలిసి ఆ కార్యక్రమాన్ని జనాల్లోకి చొచ్చుకుపోయే విధంగా తీసుకువెళ్లే బాధ్యత మనందరిదీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలని, రాష్ట్రంలోనే మన జిల్లా ఒక ప్రత్యేకత స్థానం, ముందు వరుసలో ఉంచాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ ఈశ్వర్, జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, ఇస్మాయిల్ బేగ్, బిట్రగుంట మల్కిక, నారదాసు రామచంద్ర ప్రసాద్, ఉప్పు రతయ్య, కొర్రపాటి నాగేశ్వరరావు, ఎల్.బి నాయుడు, పఠాన్ భాషా, మునిర్ హసన్, గళ్ళ వెంకట్రావు మరియు నియోజకవర్గ, సిటీ, మండల, గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.