రైల్వే కోడూరులో మెగా రక్తదాన శిబిరం

రైల్వే కోడూరు: ప్రతి సంవత్సరం ఆగస్ట్ 22వ తేదీన అన్ని కులాలకు, మతాల వారికి అన్ని పండుగల కంటే ప్రియమైన పండుగ అన్నయ్య చిరంజీవి జన్మదిన పండుగ. ఈ కార్యక్రమంలో భాగంగా బీధం నవీన్ కుమార్, దాసరి వీరేంద్ర పర్యవేక్షణలో రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ జరిగింది. దాదాపు 56 మంది రక్త దానం చేసారు. వారికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, జోగినెని మణి, పగడాల చంద్రశేఖర్, సర్పంచ్ సంయుక్త, వరికూటి నాగరాజ, నల్లంసెట్టి యానాడయ్య, ఉత్తరాది శివ కుమార్, పగడాల మణి, శ్రీకారం ప్రకాష్, కొండేటి రమణ, బల్లేపల్లి శ్రీనివాస్, గుగ్గిళ్ళ సుబ్బారాయుడు, ఉత్తరాది సి కుమార్, దేవర మనోహర్, కొండేటి రమణ, సింగిరీ రాజ తదితరులు పాల్గొన్నారు.