త్వరలో మరిన్ని చేరికలు.. భవిష్యత్ జనసేన పార్టీదే: గాదె

  • గుంటూరు జనసేనలో చేరికలు

గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో గుంటూరు పట్టణ కేవీపీ కాలనీ 21వ వార్డ్ కి చెందిన షబ్బీర్, వంశీ, బన్నీ, ఇమ్రాన్, శాస్త్రి, పవన్ హరి, ఆలీ, మస్తాన్, భవాని, రెహ్మాన్ తదితరులు పార్టీలో చేరడం జరిగింది.. పార్టీలో చేరినవారిని జనసేన కండువాలతో గాదె ఆహ్వానించి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా త్వరలో పార్టీలో మరిన్ని చేరికలు ఉండబోతున్నాయి, భవిష్యత్ జనసేన పార్టీదే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, శిఖా బాలు, జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాధ్, కొర్రపాటి నాగేశ్వరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.