కూనవరం గ్రామంలో వైఎస్సార్సిపికి భారీ షాక్

  • జనసేనలోకి కొనసాగుతున్న చేరికలు

రాజానగరం, “జనంకోసం జనసేన మహాపాదయాత్ర” 6వ రోజు కార్యక్రమంలో భాగంగా బుధవారం సీతానగరం మండలం, కూనవరం గ్రామంలో పర్యటిస్తున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో కూనవరం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు మాదవరపు వీరభద్ర రావు సమక్షంలో వైసీపీకి చెందిన సీనియర్ నాయకులు 40 మంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు, రాజకీయ విలువలకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరడం జరిగింది. వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరిన వారు అడపా శివ, నండూరి చిన్నోడు, సూరబత్తుల అన్నవరం, మెండ్రు అబద్దం, నండూరి బురయ్య మొదలగు 40 మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరభద్రరావు, మాదవరపు కోటేశ్వర రావు, ఐలి హనుమంతు, అడపా నరసింహరావు, ఉమ్మిడి సురేష్, నాని, చౌటుపల్లి నల్లిబాబు, సంతోష్, శివ, అడపా రాజు, కడిమి వెంకన్న, గుణ శేఖర్ మరియు మండల నాయకులు, మట్ట వేంకటేశ్వర రావు, ప్రశాంత్ కుమార్, కొండేటి సత్యనారాయణ, శ్రీహరి ప్రగడ, మూర్తి, వీర్రాజు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.