గండికోట బాధితులను ఆదుకోవాలి

గండికోట రిజర్వాయర్ ముంపు నుంచి ఆ పరిధిలో ఉన్న తాళ్ళ ప్రొద్దుటూరు గ్రామస్తులను వరద నీటి నుంచి కాపాడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. తమకు ఇంకా పరిహారం కూడా అందనందున తాము ఇక్కడే ఉండిపోయామని కాలనీవాసులు చెబుతున్నారన్నారు. వేరేచోట ఇల్లు అద్దెకు తీసుకునే ఆర్థిక స్థోమత వారికి లేదని పవన్ పేర్కొన్నారు. తాళ్ళప్రొద్దుటూరు విడిచే వరకు గ్రామస్తుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. గండికోట నిర్వాసితులను బలవంతంగా కాకుండా వారు ఇష్టపూర్వకంగా వెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిర్వాసితులతో అధికారులు సంప్రదింపులు జరిపి వారి అభీష్టాన్ని నెరవేర్చాలి’ అని ప్రభుత్వానికి పవన్‌కళ్యాణ్‌ విజ్ఞప్తి చేశారు.