గిరిజనులను పరామర్శించిన గర్భాన

పాలకొండ నియోజకవర్గం, సీతంపేట మండలం, వజ్జాయి గూడ గ్రామంలో విషాదం జరిగి.. వ్యాన్ బోల్తా పడి.. వ్యాన్ లో ప్రయాణిస్తున్న గిరిజనులు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే గురువారం వారిని పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం నుంచి తగిన ఆర్థిక సహాయం అందజేయాలని ఆయన కోరారు. అలాగే చికిత్స పొందుతున్న వారికి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అలాగే హాస్పిటల్లో పరిస్థితులను రోగులను అడిగి తెలుసుకున్నామని.. హాస్పిటల్ సిబ్బంది వాళ్లని జాగ్రత్తగా చూసుకుంటున్నారని రోగులు చెప్పడంతో గర్భాన సత్తిబాబు హాస్పిటల్ సిబ్బందిని కలిసి అభినందించడం జరిగింది. అలాగే హాస్పిటల్లో బెడ్స్ ఇంకా ఎక్కువగా ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ, వీరఘట్టం, భామిని, సీతంపేట మండలాల జన సైనికులు పాల్గొన్నారు.