గుంటూరు ౼ సత్తెనపల్లి నియోజవర్గంలో ఆత్మీయ సమావేశం

గుంటూరు ౼ సత్తెనపల్లి నియోజవర్గంలో నూతనంగా ఏర్పడిన మండల అధ్యక్షులు వారి కార్యనిర్వాహక సభ్యులతో, జిల్లా కార్యవర్గ సభ్యులతో మరియు కార్యకర్తలతో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మొదటగా సత్తెనపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్త అయిన మట్టం అశోక్ కుమార్ మృతికి రెండు నిమిషాలు మౌనం వహించి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గం నుంచి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, కమాల్ పాల్గొన్నారు. జిల్లా కమిటీ సభ్యులు అడపా మాణిక్యాల రావు ఇస్మాయిల్ బేగ్, బిట్రగుంట మల్లికా, కొమ్మిశెట్టి సాంబశివరావు, కొప్పుల కిరణ్ బాబు, నారదాసు ప్రసాద్, సిరిగిరి శ్రీనివాస్, హంపిరాల రాజేశ్వరి, తవిటి భవన్నారాయణ, సిరిగిరి మణికంఠ, బత్తుల కేశవ, నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.