ఎంపీ ల్యాడ్స్‌ నిధులపై వివరణ ఇవ్వండి.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ!

ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. ఎంపీ ల్యాడ్స్‌ నిధులపై వివరణ ఇవ్వాలని లేఖలో కోరింది. ఎంపీ ల్యాడ్స్‌ నిధులను మత సంబంధ భవనాలకు కేటాయించడంపై ఆరా తీసింది. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో చర్చికి రూ.86 లక్షలు ఎంపీ ల్యాడ్స్‌ నిధులు ఖర్చు చేశారని, చాలా చోట్ల ఇదే తరహాలో నిధులు వినియోగించారని కేంద్రానికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం వివరణ కోరుతూ ఏపీ ప్రభుత్వానికి లేఖ పంపింది.