ప్రభుత్వ మద్యం దుకాణం కంచికచర్ల జనసేన వినతిపత్రం

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం, కంచికచర్ల ఎమ్మార్వో కార్యాలయం నందు మండల జనసేన పార్టీ అధ్యక్షులు నాయిని సతీష్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేసిన జనసైనికులు. జుజ్జూరు రోడ్డులో గుడి, బడి, కళాశాల ఉన్న ప్రాంతంలో ప్రభుత్వ మద్యం దుకాణం నడపటం వల్ల ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపిన జనసైనికులు. స్కూలు, కళాశాలలకీ విద్యార్థినీ విద్యార్థులు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని, మద్యం దుకాణం సమీపంలో ఉన్న నాగేంద్ర స్వామి పుట్టకి వెళ్లే మహిళలు సైతం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ అధికారులు మద్యం దుకాణంపై దృష్టి సారించి వేరే ప్రాంతానికి తరలించాలని. జనసేన పార్టీ మండల అధ్యక్షులు నాయిని సతీష్ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ తోట ఓంకార్, మండలం ప్రధాన కార్యదర్శి పురమ ప్రసాద్, దేవిరెడ్డి అజయ్ బాబు కంచికచర్ల పట్టణ జనసేన నాయకులు పెద్దినేడి హరిబాబు, పుప్పాల వేణుగోపాల్, జర్రిపోతుల చంటి బాబు, కటకం నవీన్, కుర్రా నాని, మణికంఠ మరియు జనసైనికులు పాల్గొన్నారు.