ఘనంగా శిరిగినీడి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు

రాజోలు నియోజకవర్గం: జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినీడి వెంకటేశ్వరరావు జన్మదిన సందర్భంగా రాజోలు నియోజకవర్గం జనసేన నాయకుల ఆధ్వర్యంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గం నాయకులు డాక్టర్ రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, జనసేన నాయకులు పినిశెట్టి బుజ్జి, గొల్లమందల పూర్ణ భాస్కరరావు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీను, జనసేన నాయకులు రావూరి నాగు, ఉండపల్లి అంజి, రాజోలు మండలం ఉపాధ్యక్షులు ఉల్లంపర్తి దర్శనం, రాపాక మహేష్, సాధనాలు విజయ్ తదితరులు పాల్గొన్నారు.