రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించించిన పూతలపట్టు జనసేన

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం మండలం, ఐరాల మండలం, తవణంపల్లి మండలం, పూతలపట్టు మండలం లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని మండలాధ్యక్షులు కోడి చంద్రయ్య, పురుషోత్తం, సీనియర్ నాయకులు శాంతమూర్తి ఆధ్వర్యంలో సీనియర్ జనసేన నాయకురాలు శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి జిల్లా సంయుక్త కార్యదర్శి నెహ్రూ రాయల్ మరియు జనసైనికుల తో కలసి పూలమాలలు సమర్పించారు. పూతలపట్టులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి మాట్లాడుతూ, అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్క పౌరుడు దేశ అభ్యున్నతికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు, జిల్లా సంయుక్త కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.