పెడన స్థానిక వైసిపి నాయకులను హెచ్చరించిన ఎస్.వి.బాబు

పెడన నియోజకవర్గం, జనసేన నాయకులు ఎస్.వి.బాబు మాట్లాడుతూ… జోగి రమేష్ ఏది చెబితే అది, ఏం చేయమంటే అది చేసే స్థానిక వైసిపి నాయకులు, కార్యకర్తలు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దని శనివారం విశాఖపట్నంలో దాడి జరగలేదు. మీరు ఏ విధంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తారు. దాడి జరిగి ఉంటే ఆధారాలతో సహా నిరూపించండి. జోగి రమేష్ తన రాజకీయ స్వార్థం కోసం, తన వ్యక్తిగత ఇమేజ్ ని పెంచుకోవడం కోసం మిమ్మల్ని ఒక పావులా వాడుకుంటున్నాడు అది తెలుసుకోండి. అంతేగాని విషయం తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ మీద అసత్య ఆరోపణలు చేసిన, పవన్ కళ్యాణ్ ని విమర్శించినా మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు.