“నా సేన కోసం… నా వంతు” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఇమ్మడి కాశీనాధ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణము జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు జనసేనపార్టీ చేపట్టిన “నా సేన కోసం… నా వంతు” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తమ వంతు పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేయాలని తమ కార్యకర్తలకు ఆదేశించిన జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్. ఈ కార్యక్రమంలో భాగంగా మార్కాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ జనసేన పార్టీ బ్యాంక్ ఖాతాకు అనుసంధానం అయిన నెంబరు 7288040505 యొక్క గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ ఆప్ ద్వారా చాలా సులభంగా పార్టీకి విరాళం అందించవచ్చునని తెలియజేశారు.