మంగళగిరిలో జనసేనలో చేరికలు

మంగళగిరి, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు సమక్షంలో పలువురు జనసేన పార్టీలో చేరడం జరిగింది.

  1. తెలుగుదేశం పార్టీ మంగళగిరి పట్టణ మాజీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీ రావు
  2. మంగళగిరి మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాడ ఆదినారాయణ
  3. మంగళగిరి నియోజకవర్గ సిపిఎం నాయకులు మరియు సిపిఎం రాష్ట్ర యువత కార్యదర్శి కాపరవుతూ సుందరయ్య
  4. తాడేపల్లి మండలం వైసిపి నాయకులు మరియు ప్రముఖ జర్నలిస్ట్ నక్క రాజేష్ బాబు

వారి కార్యవర్గంతో సహా ఆదివారం జనసేన పార్టీలో చేరడం జరిగింది. తదనంతరం నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని వివిధ రాజకీయ పార్టీల నుండి ప్రముఖ నాయకులందరూ జనసేన పార్టీలో చేరటం ఆనందంగా ఉందని జనసేన పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని తెలియజేశారు. ఎం.టి.ఎం.సి కోఆర్డినేటర్ గా మునగపాటి వెంకట మారుతీ రావు ని ఈ సందర్భంగా నియమించారు. అలాగే మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర గురించి వైసిపి నాయకులు చేస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించి భారతదేశంలోని ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు చేపట్టని కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ చేపడుతున్నారని మరియు ప్రజలలో జనసేన పార్టీకి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక వైసిపి నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారని చిల్లపల్లి శ్రీనివాసరావు ధీటుగా స్పందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ మరియు రాష్ట్ర చేనేత వికాస్ విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ అధ్యక్షులు షేక్ కైరల్లా, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, రాష్ట్ర చేనేత కమిటీ ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, శెట్టి రామకృష్ణ, బత్తిన అంజయ్య, సాయి నందన్,వెంకట్, నందం మోహన్ రావు, తదితర జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.