దొడ్లేరు గ్రామంలో జనసేన కార్యాలయ ప్రారంభోత్సవం

పెదకూరపాడు నియోజకవర్గం: క్రోసూరు మండలం, దొడ్లేరు గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయం ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది.. అలాగే ఈ కార్యక్రమానికి పెదకూరపాడు ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గంలో విపరీతమైన సహజ సంపదని దోచుకుంటున్న ఈ ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి మాత్రం మరిచిపోయిందని వృద్దులకు, వితంతువులకు ఇచ్చే ప్రభుత్వ పెన్షన్ వాలంటీర్ల ద్వారా ఇవ్వడం జనసేన, తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారని వైసీపీ ప్రభుత్వం కల్లబొళ్ళు మాటలు చెప్తూ కాలం గడుపుతుందని. సినిమా టికెట్లు, మద్యం బాటిల్లు ప్రభుత్వ ఉద్యోగుల చేత అందించిన ఈ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వటానికి కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారని దుయ్యబడ్డారు.. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రతి జనసైనికులకి తెలుగుదేశం బిజెపి కార్యకర్తలకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెదకూరపాడు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త యర్రంశెట్టి రామకృష్ణ, డాక్టర్ రాయపాటి సాయి కృష్ణ, సుధా సాంబశివరావు, 5 మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, గ్రామ అధ్యక్షులు నాయకులు వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.