Anantapuram: శ్రీ దలవాయి చలపతిరావు పద్మశ్రీ అవార్డు స్వీకరించడం అందరికీ గర్వకారణం

అనంతపురం జిల్లావాసి, తోలుబొమ్మల కళాకారులు శ్రీ దలవాయి చలపతిరావు పద్మశ్రీ పురస్కారం స్వీకరించిన సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ జనసేన పార్టీ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీ చలపతిరావు పద్మశ్రీ అవార్డు స్వీకరించడం అందరికీ గర్వకారణమన్నారు.