జనసేనాని ఆశయ సిద్ధాంతాలకు తోడుగా ఉందామని పిలుపునిచ్చిన మండేల బాబీ నాయుడు

రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం మలికిపురం నుంచి విశ్వేశ్వరపురం వేళ్ళే ప్రధాన రహదారి గుంత గుంతలుగా ఉన్నాయని జనసేన తరఫున గళాన్ని వినిపించి వీడియో రూపంలో పోస్ట్ చేయడం జరిగింది. దానికి స్పందించిన అధికారులు బుధవారం రోడ్డు మరమత్తు పనులు మొదలుపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా స్పందించి రోడ్డు మరమ్మత్తు పనులు మొదలుపెట్టిన అధికారులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని… అదేవిధంగా దీనికి శాశ్వత పరిష్కారం కూడా త్వరలోనే తీసుకొస్తారని ఆశిస్తున్నానని, ఇది జనసేన విజయం అని ఒక జనసైనికుడిగా గర్వంగా చెబుతున్నానని ప్రతి ఒక్క జనసైనికుడు మీ గళాన్ని బలంగా వినిపించండి జనసేనాని ఆశయ సిద్ధాంతాలకు తోడుగా మన వంతు కృషి చేద్దామని ఈ సందర్భంగా మండేల బాబీ నాయుడు పిలుపునివ్వడం జరిగింది.