జనసేనాని జన్మదిన వేడుకలు ఘనంగా జరపాలని పిలుపునిచ్చిన పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ పిఎసి సబ్యులు పితాని బాలకృష్ణ అధ్యక్షతన నియోజకవర్గ జనసేన పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సెప్టెంబరు రెండవ తారీఖున జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కార్యకర్తలు సమాయత్తం కావాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. మన ఆరాద్యదైవం ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజున అన్నదానం, వస్ర్తదానం, రక్తదానం‌తో పాటు వివిధ కార్యక్రమాలు గ్రామగ్రామాన నిర్వహించాలని ఆయన‌ కార్యకర్తలను సమాయత్తం చేసారు. అలాగే ఇటీవల జనసేన పార్టీ కొరకు స్వచ్ఛంద విరాళాలు అందించే కార్యక్రమంలో బాగంగా నాసేన కోసం నావంతు కార్యక్రమాన్ని రాష్ట్ర పిఎసి సభ్యులు కొణెదల నాగబాబు ప్రారంభించారు. కులమతాలకు అతీతంగా ప్రతీక్షణం ప్రజాశ్రేయస్సు కొరకు నిలబడి ప్రజలపక్షాన పోరాడుతున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతీ కార్యకర్త పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నా సేన నావంతు కార్యక్రమంలో అందరూ భాగస్వాములై 7288040505 అనే యుపీఇ ఐడి కి విరాళాలు అందచేసి పార్టీని బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ కి అండగా నిలబడాలని పితాని బాలకృష్ణ తెలియచేసారు.