జగన్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కారు

  • వచ్చేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వమే ప్రజలకు అన్నివిధాలుగా అండగా ఉంటాం
  • 27వ రోజు 1వ డివిజన్ మహాత్మా గాంధీ కాలనీలో కొనసాగిన మహిళలతో మాట మంతి కార్యక్రమం
  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపురం అర్బన్: జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత శనివారం మహిళలతో మాటామంతి కార్యక్రమంలో బాగంగా 27వ రోజు అనంతపురం అర్బన్ నియోజక వర్గంలోని 1వ డివిజన్ మహాత్మా గాంధీ కాలనీ నందు పర్యటించి మహిళలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ రెడ్డి 2019 ఎన్నికల లో ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కారని అమ్మవడి, మద్యపాన నిషేధం, రైతులకు ఇంపుట్స్ సబ్సిడీ, ఇనాం భూములకు చట్టబద్దత, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్మెంట్, వైఎస్సార్ జలయజ్ఞం, పేదలందరికీ ఇల్లు, ఆరోగ్యశ్రీ ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ నోటి నుంచి వచ్చినప్రతి హామీ పచ్చి అపద్దమే అని వీటితో పాటు స్థానిక డివిజన్ లో వైకాపా నాయకుల వేధింపులతో మహిళలు బ్రయబ్రాంతులకు గురవుతున్నారని నీటి ఎద్దడి తీవ్రస్థాయిలో ఉందని ఇన్ని సమస్యలు ఉన్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడని, మహిళలు దైర్యంగ ఉండాలని వచ్చేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వమేనని తప్పకుండా అందరికీ సమన్యాయ పాలన అందిస్తామని మీరు చేయాల్సిందల్లా కూటమి అభ్యర్థికి ఓటు వేయడమే అన్నారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.