జగన్ రెడ్డి నిరంకుశత్వ పాలనను ఎండగట్టిన శ్రీమతి పాలవలస

విజయనగరం: అశోక్ బంగ్లాలో ఎన్.డి.ఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని పూసపాటి అధితి విజయలక్ష్మి గజపతి రాజు ఆధ్వర్యంలో జరిగిన పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకురాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి పాల్గొనడం జరిగినది.
ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత ఏ పి సీఎం జగన్ మోహన్ రెడ్డిపై వేసిన ఛార్జ్ షీట్ గురించి మాట్లాడుతూ వైసీపీ అరాచకాలను జగన్ మోహన్ రెడ్డి నిరంకుశత్వ పాలనను ఎండగట్టడం జరిగింది. 13 లక్షల కోట్లు అప్పుచేసి అదే అభివృద్ధి అని చెప్పుకుంటూ ప్రతీ ఒక్క ఆంధ్ర ప్రజల మీద దాదాపు 10 లక్షలు అప్పు నెత్తి మీద పెట్టాడు అని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో ఎన్.డి.ఏ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, కిమిడి నాగార్జున, బీజేపీ జిల్లా ముఖ్య నాయకులు, పాల్గొనడం జరిగినది.