కళ్యాణదుర్గం జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు

కళ్యాణదుర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో బాగంగా కళ్యాణదుర్గం పట్టణం, ముదిగల్లు రోడ్డులో ఉన్న జగనన్న కాలనీలను సందర్శించడం జరిగింది. ఇల్లు లబ్ధిదారులను కలిసి వారి ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పి ప్రజలని మభ్యపెట్టి మోసం చేసే విధంగా పరిపాలన కొనసాగిస్తా ఉంది… ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా కూడా తెలియాలి పేదలకు న్యాయం జరగాలి అనేటువంటి ఆలోచనతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా కూడా జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు అందరూ కూడా అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ యొక్క జగనన్న ఇళ్లు పేదవాడి కన్నీళ్లు అనే నినాదంతో పేదవాడు కన్నీళ్లు తుడిచ్చేందుకు ఈరోజు జనసేన పార్టీ అడుగు ముందుకి వేయడం జరిగింది.. ఈ రోజు కళ్యాణదుర్గం పట్టణంలో పేదలకు ఇచ్చిన జగనన్న ప్లాట్లను పరిశీలించడం జరిగింది… అందులో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లకు పునాదులు తీయకుండా నాసిరకంగా సిమెంటు వాడుతూ ఇల్లు నిర్మాణం చేపడుతూ ఉన్నారు.. వర్షాలు వచ్చినా ఇల్లు పడిపోయే విధంగా నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది అని లబ్ధిదారులు వాపోతున్నారు… ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు సక్రమంగా బిల్లులో చెల్లించకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు… ఇసుక ఉచితమని చెప్పి లబ్ధిదారులు దగ్గర డబ్బులు తీసుకుంటూ ఇసుకను అందజేస్తూ ఉన్నారు… కాంట్రాక్టు పద్ధతిలో ఇళ్లను నాసిరకంగా నిర్మిస్తూ లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది… ఒక చిన్న అంగడి నిర్వహించేలాగా రూములు ఉన్నాయి… మౌలిక వసతులు త్రాగునీరు, విద్యుత్తు, రోడ్లు లేకుండా కాలనీలో నిర్మిస్తూ ఉన్నారు… ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, కుందుర్పి మండల అధ్యక్షుడు జయకృష్ణ, బ్రహ్మసముద్రం మండల అధ్యక్షుడు ఆంజనేయులు, చిత్తూరు మండల అధ్యక్షులు కాంత రాజ్, వంశీ, రామలింగ, జాకీర్, చితప్ప, ముక్కన్నా, శ్రీహర్ష, ప్రసన్న, శ్రావణ్, శ్రీకాంత్ , నరేష్ నీలకంఠ, వినాయక, మొదలైన జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.