జగనన్నఇల్లు – పేదలందరికీ కన్నీళ్లు సోషల్ ఆడిట్

మడకశిర, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు వరుణ్ హిందూపూర్ ఇన్చార్జ్ ఉమేష్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో 12,13,14 తేదీలలో నిర్వహించిన జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు అనే సామాజిక పరిశీలన కార్యక్రమంలో 14వ తేది మూడవ రోజు సోషల్ ఆడిట్లో భాగంగా మడకశిర నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో హౌసింగ్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ కార్యాలయం సచివాలయాలకి వెళ్లి ఎన్ని గృహాలు మంజూరు అయ్యాయి? ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు? ఎంపిక అనుసరించిన విధానాలు ఏమిటి? ఇప్పటివరకు లబ్ధిదారులకు ఎంత మేరకు బిల్లులు మంజూరు చేశారు? వంటి విషయాలను సచివాలయ సిబ్బందిని ఉన్నత అధికారులను అడిగి వాళ్ళు చెప్పిన మాటలు ఎక్కడా పొంతన లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మడకశిర మండల అధ్యక్షుడు టి.ఏ శివాజీ, హనుమంతు, రాము, పవన్ కళ్యాణ్, హరి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.