ప‌డ‌మ‌ర గంగ‌వ‌రంలో ఘ‌నంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజు వేడుక‌లు

  • విద్యార్థుల‌కు నోట్‌బుక్స్ పంపిణీ

ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం కురిచేడు మండ‌లంలోని ప‌డ‌మ‌ర గంగ‌వ‌రం గ్రామంలో శుక్ర‌వారం జ‌న‌సేన పార్టీ అధినేత పవ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను జ‌న‌సైనికులు ఘ‌నంగా నిర్వ‌హించారు. జ‌న‌సేన పార్టీ ప్ర‌కాశం జిల్లా ప్రోగ్రామ్ క‌మిటీ స‌భ్యులు, ప‌డ‌మ‌ర గంగ‌వ‌రం పంచాయ‌తీ వార్డు సభ్యులు ప‌సుపులేటి చిరంజీవి ఆధ్వ‌ర్యంలో గ్రామంలోని సెంట‌ర్‌లో, క్రిస్టియ‌న్ పాలెంలో కేకు క‌ట్ చేసి పంచిపెట్టారు. అనంత‌రం స్థానిక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కు నోట్‌బుక్స్‌, పెన్నులు పంపిణీ చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆయురారోగ్యాల‌తో ఉంటూ మ‌రిన్ని విజయాల‌ను అందుకోవాల‌ని జ‌న‌సైనికులు ఆకాంక్షించారు. పవ‌న్ క‌ళ్యాణ్ నాయ‌క‌త్వం వర్థిల్లాలి, జై జ‌న‌సేన అంటూ నినాదాలు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కాట్రాజ్ వెంకటేష్ గురు బాబు వరుకూటి రమేష్ వరుకూటి రాజు పసుపులేటి గోపి పసుపులేటి నాగేశ్వరరావు గాజుల చిరంజీవి పరిమిశెట్టి శివ జి బూసి వరుకూటి పసుపులేటి కళ్యాణ్ ఏస్ కోటయ్య ఇత్తడి యోగయ్య ఎస్ జైపాల్ ప‌లువురు జ‌న‌సైనికులు పాల్గొన్నారు.