ప్రమాదంలో మరణించిన జనసైనికుని కుటుంబాన్ని ఆదుకున్న కాకినాడ జనసేన

కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామ జనసైనికుడు అనుసూరి ఈశ్వర్ ఇటీవల ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆకుటుంబాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో రూరల్ మండల జనసైనికులు సమకూర్చిన 20000 రూపాయలను జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ సమక్షంలో ఈశ్వర్ తల్లికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు పీఏసీ సభ్యులు నానాజీ అభినందనలు తెలిపారు. సహకరించిన దాతల వివరాలు..గిడుతురి వెంకట్(ఎన్.అర్.ఐ) – 10000 రూ., తాటికాయల బుజ్జి 2000 రూ., గేదెల చిన్నారావు 1500 రూ, కరెడ్ల గోవింద్ 1000 రూ, కట్ట జగన్ 1000 రూ. రామిశెట్టి సునీల్ 1000 రూ. సత్యకుమార్ 1000 రూ., సంతోష్ కుమార్ 500 రూ., పబ్బినిది వీరబాబు 500 రూ., గుబ్బల సుబ్రహ్మణ్యం 500 రూ., సి.హెచ్ శ్రీను 500 రూ., పి. రాజు 500 రూ. మొత్తం కలిపి 20,000 రూపాయలు.