వనుదురు సర్పంచ్ చేసిన ఆరోపణలపై స్పందించిన జనసేన నాయకులు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిస్టాత్మకంగా మొదలుపెట్టిన “జానవాణి – జనసేన భరోసా” కార్యక్రమంలో జనసైనికులు చేసిన ఫిర్యాదుపై వనుదురు సర్పంచ్ చేసిన వ్యాఖ్యలకు కొత్తపల్లి జనసేన నాయకులు వివరణ ఇవ్వడం జరిగింది. తాము చేసింది తప్పుడు ఆరోపణలు కాదు అని సర్పంచ్ గా పోటీచేసి గెలిచిన అర్జునరావుకి తాము ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాము కానీ ఆ విషయాలు మీకు తెలియదు ఏమో, దానికి సంబందించి ఆయన కూడా తాను మాట్లడుతాను అని సమాధానం ఇచ్చారన్నారు. ఇప్పుడు పదవిలో ఉన్న మీరు ఫిల్టర్ బెడ్లు బాగుచేయించమని అడిగితే నిధులు లేవు అనడం సబబు కాదు అని తెలిపారు. నీళ్లు మురికులు రావడంతో ఎన్నో సార్లు తాము సర్పంచ్ గారికి తెలియచేసాము అని అలానే సచివాలయంలో వినతిపత్రం కూడా ఇచ్చాము అని గుర్తుచేశారు, మరి అలాంటప్పుడు మీరు బాధ్యతలు తీసుకున్నాక ఎందుకు సమస్య పరిష్కరించలేదు అని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లగా ఉన్న స్మశాన వాటిక సమస్య గురుంచి మీకు తెలియదా మీరు ఎందుకు నోరు మెదపడం లేదు అని అన్నారు. మీరు పదవి స్వీకరించి ఇన్ని నెలలు గడుస్తున్నా ఏ రోజు కూడా స్మశానం గురుంచి ఎందుకు ఉన్నతధికారులకు విన్నవించుకోలేదు అని ప్రశ్నించారు. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్తారు అని కొత్తపల్లి ప్రజానీకం ఎదురు చూస్తున్నారు అని తెలిపారు.