బొరుసు వీరబాబు కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

రాజోలు: మామిడికుదురు మండలం, గోగన్నమఠం గ్రామానికి చెందిన బొరుసు వీరబాబు కాలం చేశారు. విషయం తెలుసుకున్న రాజోలు జనసేన నాయకులు గురువారం వీరబాబు కుటుంబ సభ్యులను కలసి, ప్రగాఢ సానుభూతి తెలిపి, వారి కుటుంబానికి 12,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసారు. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, అల్లు సురేశ్, జనసేన నాయకులు పూర్ణభాసరరావు, ఎంపీపీ మేడిచర్ల రాము, రావూరి నాగు, ఉండపల్లి అంజి తదితరులు ఉన్నారు.