జంబూపట్నంలో జనంకోసం జనసేన మహాపాదయాత్ర

రాజానగరం, రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ ఆశయాలు సిద్దాంతాలు ప్రజలకు చేరువచేస్తూ, కోరుకొండ మండలం జంబూపట్నం గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ, ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, రామరాజ్యం తీసుకువస్తానని నమ్మించి ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చిన ఈ దుర్మార్గపు దుష్ట వైస్సార్సీపీ పాలనను అంతమోందించి ప్రజా పరిపాలన సుపరిపాలన తీసుకురావడానికి, మన తరువాతి తరాల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చుకోవడానికి ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇచ్చి బత్తుల బలరామకృష్ణని అఖండ మెజారిటీతో గెలిపించండి అని జనసేన పార్టీ కరపత్రం, బ్యాడ్జ్, కీచైన్ అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ సభ్యురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, వారి కుమార్తెలు వీరమహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి తోట ప్రత్యూషాదేవి, వందనాంబికలు అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన- తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.