శివప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నేతలు

ఎచ్చెర్ల నియోజకవర్గం: రణస్థలం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు బస్వ గోవిందరెడ్డి పిలుపు మేరకు తెప్పలవలస పంచాయతీ నీలంపేట గ్రామంలో యాగాటి లక్ష్మణ్, రమణమ్మ కుమారుడు యాగాటి శివప్రసాద్ 15రోజలు క్రితం అనివార్య కారణాల వలన చనిపోయారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి, ఆర్ధిక సహాయంచేసి ఆకుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి, మీకు జనసేన పార్టీ ఎల్లవేళలా తోడుగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. రణస్థల మండల నాయకులు వడ్డాది శ్రీనువాస్, దాసరి బలరాం, ఇజ్జిరొతు రమణ, పోట్నూరు లక్ష్మునాయుడు, గొర్లె సూర్య, ముళ్ళు శ్రీను, కే బాలు, స్ధానిక జనసేన కార్యకర్తలు యాగాటి రమణ, కొండలరావు, అది, గోవిందా, రమణ, పార్వతి, రమణమ్మ, ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.