జనం కోసం జనసేన మహాపాదయాత్ర

  • కోరుకొండ గ్రామంలో బత్తులకు జేజేలు కొట్టిన ప్రజానీకం
  • జై జనసేన జై బత్తుల నినాదాలతో హోరెత్తిన కోరుకొండ వీధులు
  • బత్తుల బలరామకృష్ణ విజయానికి సమిష్టిగా కృషి చేద్దాం – బత్తుల
  • గ్రామంలో అంబెడ్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపే ధ్యేయంగా.. నిరంతరం ప్రజా క్షేమమే లక్ష్యంగా నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజలతో మమేకమవుతున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ బత్తుల బలరామకృష్ణని గెలిపించుకుని విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, వ్యవసాయం, వ్యాపారం అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని తెలియజేస్తూ కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో జనసేన పార్టీ మహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గ్రామంలో ప్రతీఇంటికీ తిరుగుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్దాంతాలు ప్రజలకు తెలియజేస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, బ్యాడ్జ్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.