సత్రవపాలెంలో బొమ్మిడి నాయకర్ పాదయాత్ర

  • జనంలోకి జనసేన 12వ రోజు

నరసాపురం నియోజకవర్గం: జనంలోకి జనసేన 12వ రోజు కార్యక్రమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గం, మొగల్తూరు మండలం, సత్రవపాలెంలో నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ ఇంటింటికీ తిరిగి, జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేసి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని జనసేన పార్టీ తరపున భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ ముఖ్యంగా ఈ గ్రామంలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని నాయకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి గోపికృష్ణ, ఆకన చంద్రశేఖర్, వలవల నాని, వాతాడి కనకరాజు, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, నిప్పులేటి తారకరామారావు, కొట్టు రామాంజనేయులు, పోలిశెట్టి నళిని, దూది బాబు, బొక్కా చంటి, అయితం చిన్ని, ఉప్పులూరి రాంబాబు, పిప్పళ్ల సత్య, నల్లి నాగరాజు, లక్కు బాబి, కడలి త్రిమూర్తులు, పులపర్తి రాంబాబు, బళ్ల హనుమంతు, ఆలపాటి మోహన్, చికటపు నాగబాబు, బంగారు సురేష్, అడ్డాల ఏడుకొండలు, వాటాల దుర్గారావు మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.