రైతు భరోసా యాత్ర గోడప్రతులు ఆవిష్కరించిన కనిగిరి జనసేన

ప్రకాశం జిల్లా, కనిగిరి నియోజకవర్గం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న 3000 మంది కౌలు రైతు కుటుంబాలను విడతల వారిగా పరామర్శించి కుటుంబానికి 1 లక్ష రూపాయలు చొప్పున మొత్తం 30 కోట్ల రూపాయల సొంత నిధులతో జనసేన రైతు భరోసా యాత్ర చేస్తున్న సందర్బంగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ జనసైనికుల సహకారంతో గోడ పోస్టర్ లు ముద్రించి, ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పామూరు మండల నాయకులు డి ఏడుకొండలు, ఆర్ సునీల్, గి సునీల్, గుత్తి మహిత్, గుత్తి అఖిల్, పవన్ కళ్యాణ్, రవి, సత్యనారాయణ, రాజా, వెంకట్రావు, కాలేషా, వినయ్, పవన్, నారాయణ, నరసింహ, మహిళా నాయకురాలు సూరే రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.