బి.పి.మండల్ విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నందుకు ప్రభుత్వంపై జనసేన నిరసన

గుంటూరు, మాజీ భారతదేశ పార్లమెంట్ సభ్యులు, సంఘ సంస్కర్త, వెనకబడిన తరగతుల వారి తలరాతలు మార్చిన జాతీయ బీసీ కమీషన్ మాజీ చైర్మన్ బిందేశ్వరి ప్రసాద్ మండల్(బి.పి.మండల్) విగ్రహావిష్కరణ దిమ్మెను కూల్చివేసిన ప్రభుత్వ తీరును ఖండిస్తూ ఈ రోజు అమరావతి రోడ్డు చిల్లీస్ డాబా వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించటం జరిగినది. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… బీపీ మండల్ విగ్రహం ఏర్పాటు చేయాలని లేనియెడల నిరాహార దీక్ష చేస్తామని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కి హెచ్చరించడం జరిగినది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… బి.పి.మండల్ విగ్రహ నిర్మాణాన్ని కూల్చివేయటం బీసీలను అవమానించడం అని అన్నారు. ఈ విగ్రహం నిర్మాణాన్ని మరుల పూర్తి చేయాలని లేనియెడల జనసేన పార్టీ తరఫున నిహార దీక్ష, రాస్తారోకలు చేస్తామని చెప్పడం జరిగినది. అధికార పార్టీ వారు బీసీలను ఆదరించే పార్టీ మాది అన్ని, వాటికి గౌరవం మా పార్టీ వల్లే అని డొల్ల పలుకులు పలుకుతూ ఇలా బీసీ నాయకుడిని అవమానపరచడం ఎంత మటుకు సమంజసం అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు స్టేట్ కార్యదర్శి నాయబ్ కమాల్, జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, ఆళ్ళ హరి, కార్యదర్శి నక్కల వంశీ, కొర్రపాటి నాగేశ్వరరావు, మధు లాల్, శ్రీపతి భూషయ్య, తన్నీరు గంగరాజు, రాజేష్, సాలేటి పుల్లారావు, తుమ్మల నరసింహారావు, కొత్తకోట ప్రసాద్, నాని, రాంబాబు, చక్రి, సుభాని, హనుమ నాయక్, పవన్ కళ్యాణ్, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.