కాకినాడ సిటీ పరిధిలో జనహృదయ నేత జనసేనాని జన్మదిన వేడుకలు
కాకినాడ సిటీ నియోజకవర్గం: కాకినాడ సిటీ నియోజకవర్గ పరిధిలో వాడ వాడల జనహృదయ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఆహ్లాదకరమైన వర్షం వాతావరణంలో వివిధ సేవా కార్యమాలతో పాటుగా శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి, ఈ రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా మార్చుకుని రాబోయే తరాలకు బంగారు భవిష్యత్తు అందజేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు తోట సుధీర్, నాయకులు వాసిరెడ్డి శివ, తలాటం సత్య, అట్ల సత్యనారాయణ, బడే కృష్ణ, విజయ్ గోపాల్, ఎస్ కె వలీబాషా, పెద్దిరెడ్డి ఉదయ్ భాస్కర్, ర్యాలీ రాంబాబు, ముత్యాల దుర్గాప్రసాద్, వరద దొరబాబు, కుచ్చర్లపాటి వెంకట అర్జున్, కుమారి దారపు శిరీష, శ్రీమతి మిరియాల హైమావతి, కంఠ రవిశంకర్, వాడ్రేవు లోవరాజు, కటారి శ్రీను, మండపాక దుర్గాప్రసాద్, మనోహర్ లాల్ గుప్తా, తల్లిబొయిన సత్యనారాయణ, ఆకుల శ్రీనివాసు, తోట లక్ష్మీ నరసింహ కుమార్, శ్రీమతి మరియ, శ్రీమతి చొడిపిల్లి సత్యవతి, అగ్రహారపు సతీష్, దారపు సతీష్, చికట్ల శ్రీనివాసు, పొరుపల్లి చిట్టి శేఖర్, డాక్టర్ బాబు, పచ్చిపాల మధు, మొల్లేటి లోక భగవాన్, సాధనాల గంగాధర్, మోస ఏసుబాబు, దుర్గాప్రసాద్, వంశీ, జాక్, ధోని, నాగు, శ్రీమతి మోర్తా మాలతి, శ్రీమతి సుజాత, కుమారి దీప్తి, శ్రీమతి తనంచింతల రమ్య. తదితర నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు మరియు నగర పెద్దలు పెసంగి ఆదినారాయణ, డాక్టర్ చిట్ల కిరణ్, నందిపాటి బాల గంగాధర్ తిలక్, అంకం శ్రీమన్నారాయణ, కనకాల రాజా, ఐరెడ్డి గంగాధర్, సురేష్, భావిరెడ్డి నిరంజన్ నాయుడు, నూకల బలరాం, విశ్వేశ్వరరావు, యాళ్ల వీర వెంకట సత్యనారాయణ, పచ్చిపాల కోడిశ్రీను, నంబారి రవి, నాగడముడి సత్యనారాయణ రాజు, మవులూరి సురేశ్, వాసే ప్రశాంత్ రాయలు, రత్న కిశోర్, గుర్రాల జాన్ లతో కలసి అడబాల సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక 6 మరియు 7 డివిజన్ లలో పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని అద్భుతంగా ఏర్పాటు చేసిన లోకేష్ ఆర్ట్స్ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.