నరసాపురం నియోజకవర్గంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరికలు

నర్సాపురం: జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి నరసాపురం నియోజకవర్గం, శేరేపాలెం గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్ తణుకుల ముక్తేశ్వర రావు మరియు వారి అనుచరులు ఉన్నమట్ల చినబాబు, దీపాటి ఇస్సాకు, బొడ్డు సత్య ప్రసాద్, విల్లూరి యోహాను, బూసి ఇస్సాకు, విల్లూరి రత్నరాజు, విల్లూరి శ్యాంబాబు, సోడదాసి కుటుంబరావు, దీపాటి ఇశ్రాయేలు, నల్లి రత్నరాజు, శిరిగినీడి పెద్దిరాజు, దూసనపూడి నరసింహారావు, బోయిన పెద్దిరాజు, చెన్ను శ్రీరాములు, కొత్తపల్లి సోమరాజు, తణుకుల కిరణ్, శిరిగినీడి బాబీ, కత్తుల రాంబాబు, దూసనపూడి రామాంజనేయులు, ఆకుల పెద్దిరాజు, గూడూరి శ్రీనివాస్, గంగుమోయిన ప్రసాద్, తణుకుల రామకృష్ణ, శిరిగినీడి సుబ్బారావు, కొత్తపల్లి త్రిమూర్తులు, దూసనపూడి బాలాజీ, దూసనపూడి ఏడుకొండలు మరియు దాదాపుగా 150 మంది మాజీ మంత్రి వర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు మరియు కలవకొలను తాతాజీ ఆధ్వర్యంలో, టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నాయకర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.