అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీకేజీ ఘటన బాధితులకు అండగా జనసైనికులు

అనకాపల్లి జిల్లా, ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాస్ లీకేజ్ బాధితులను, విషవాయువులు లీకై అస్వస్థతకు గురైన మహిళలకు, స్పృహ కోల్పోయిన కార్మికులకు అండగా నిలుస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్న అనకాపల్లి జనసైనికులు.

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని.. ఇదే పరిశ్రమంలో రెండవసారి ఈ తప్పిదం జరగడం చాలా బాధాకరమని.. తక్షణమే దీనికి కారణమైన కంపెనీపై తక్షణం చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరపున కోరారు.

స్థానిక జనసైనికులు తాడి రామకృష్ణ, రాందాస్ గోవిందా, రాకాసి డోరా, మల్ల శ్రీను, అపికొండ గణేష్, బారినకన రాము, గొల్లవిల్లి రాజు బాదితుల ఆరోగ్యం కుదుటపడే వరకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.