కాట్రావులపల్లిలో జనంకోసం జనసేన 18వ రోజు

జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ పాటంశెట్టి సూర్యచంద్ర చేపట్టిన జనంకోసం జనసేన 18వ రోజు జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసైనికులకి అండగా ఉంటానని తెలిపారు. అనేక ప్రజా సమస్యలు తెలుసుకుని సోమవారం జగ్గంపేట మండలంలో జరిగే స్పందన కార్యక్రమంలో ఎంపీడీవో, ఎమ్మార్వో ఆఫీసు వద్దకు వెళ్లి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కార మార్గ దిశగా చూపుతాను అని సూర్యచంద్ర గ్రామస్తులకు భరోసా ఇచ్చారు.