రాజమండ్రి రూరల్ మండల కార్యవర్గాన్ని ప్రకటించిన జనసేన

తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు రాజమండ్రి రూరల్ మండలాధ్యక్షుడు చప్పా చిన్నారావు అధ్యక్షతన రాజమండ్రి రూరల్ మండల కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇదే కార్యక్రమంలో కొంతమూరు గ్రామానికి చెందిన మైనార్టీ యువకులు, కోలమూరు గ్రామానికి చెందిన యువకులు సుమారు 50 మంది కందుల దుర్గేష్ చేతుల మీదుగా జనసేన కండువా వేసుకుని పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో చెరుకూరి రామారావు, పుల్లా రామారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు భీర ప్రకాష్, షేక్ అమీనా, ఇతర జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.