గజపతినగరం జనసేన ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

గజపతినగరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా నాయకులు సురేష్ మర్రాపు ఆధ్వర్యంలో గజపతినగరం జనసైనికుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వ్యవస్థ మార్పుకోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టారని, అయన ఆశయాలకు తగ్గట్టుగా భారతదేశంలోనే రైతు భరోసా యాత్ర పేరిట రైతులను ఆర్ధికంగా ఆదుకుంటున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని పార్టీ బలోపేతంనకు ప్రతీ యొక్క జనసైనికులు, వీరమహిళలు పాటుపడాలని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా రోజుకు ఒక సేవా కార్యక్రమం వారం రోజులు పాటు నిర్వహించడం జరిగిందని, ఆగష్టు 27నుండి సెప్టెంబర్ 2 వరకు నిర్వహించామని, ప్రతీ కార్యక్రమం ప్రజలతో మమేకమై, పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధముగా నిర్వహించడం జరిగిందని, భవిష్యత్ లో పార్టీ బలోపేతంనకు మరెన్నో కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు డా.మిడతాన రవికుమార్, గజపతినగరం నియోజకవర్గ జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.

  • పడాల అరుణమ్మ ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు పడాల అరుణమ్మ జనసేన పార్టీ కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలో భాగంగా ఆయన పేరుమీద భూదేవి పేటలో ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లి అన్నదాన కార్యక్రమం, మెంటాడలో రక్తదాన శిబిరం, కె.కృష్ణాపురంలో కేక్ కటింగ్, బైక్ ర్యాలీ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పడాల అరుణమ్మ తనయుడు, శరత్, మరియు జగన్, గెద్ద రవి, మురళి, మహేష్, రామారావు, శంకర్, సంతోష్, సత్యనారాయణ తదితర నాయకులు మరియు యువత పాల్గొన్నారు.