పాలకొండ జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జనసేనుని జన్మదిన వేడుకలు

పాలకొండ నియోజకవర్గం: వీరఘట్టం మండలం నడుకూరు గ్రామంలో జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స పుండరీకం ఆధ్వర్యంలో ఉదయం శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం గ్రామంలో వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. సాయంత్రం కేక్ కటింగ్, ఆహార పంపిణీ, సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన నియోజక వర్గం నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు నిమ్మల నిబ్రమ్ మాట్లాడుతూ క్రియాశీలక సభ్యులు, జనసైనికులు, మెగా అభిమానులు అందరూ మీ మీ ఇంటిలో మీ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, బంధువులకు, మీ ఇరుగు, పొరుగు ఇంటి వారికి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలగురించి, జనసేన పార్టీ సిద్ధాంతాలని, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఎమీ చేస్తుందో మేనిఫెస్టోలోని అంశాలు వివరించాలని, అదేవిధంగా వైస్సార్సీపీ పాలనలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, నిరుద్యోగ సమస్య గురించి వివరంగా వివరించాలన్నారు. క్రియాశీలక సభ్యుడు మత్స పుండరీకం మాట్లాడుతూ ముందు మన ఇంటినుండి మార్పు మొదలు పెట్టండి జనసేన పార్టీ ఓటర్లుగా మార్చండి అని జనసైనికులకు సూచించారు. నియోజక వర్గం నాయకులు అల్లు సాయిరాం, అనిల్, రమేష్, సింహాద్రి, జనసేన జాని, కర్ణేన సాయి పవన్ మరియు నడుకూరు గ్రామ క్రియాశీలక సభ్యులు ముంజేటి అప్పలనాయుడు, ముంజు సాయి, వాన మహేష్, మాచర్ల చందు, బెజ్జిపురపు సాయి, మత్స కృష్ణ రావు, సాధు రాజేష్, తూముల సుబ్బు తదితరులు పాల్గొన్నారు.