33వ వార్డు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించిన జనసేన కార్పొరేటర్

విశాఖపట్నం, దక్షిణ నియోజకవర్గం 33వ వార్డులో ఇటీవల శంకుస్థాపన చేసిన 18.37లక్షల రూపాయల విలువ గల బిటీ రోడ్డు(తార్ రోడ్డు) నిర్మాణ పనులు సోమవారం ప్రారంభించడం జరిగింది. ఆ పనులను జనసేన ఫ్లోర్ లీడర్ 33వ వార్డు కార్పొరేటర్ భీశెట్టి వసంత లక్ష్మి, విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు గోపీకృష్ణ(జికె) దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. అనంతరం 33వ వార్డులో మీతో మీ కార్పొరేటర్ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ 33వ కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మికి చెప్పిన సమస్యల దృష్ట్యా సోమవారం వీధి లైట్లు మార్చడం, లేని చోట్ల ఏర్పాటు చేయడం కోసం పరివేక్షణలో భాగంగా సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జి.వి.ఎం.సి ఎలక్ట్రికల్ సూపర్వైజర్ సూర్య, జనసేన దక్షిణ నియోజకవర్గ నాయకులు గోపికృష్ణ(జికె), వీరమహిళ నాగమణి తదితరులు పాల్గొన్నారు.